పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆకాశము నుండి ఏదైనా సూచక క్రియ చేసి చూపించమని యేసును అడిగారు (16:1).
పరిసయ్యులు, సద్దూకయ్యులకు యోనాను గూర్చిన సూచక క్రియ వారికి అనుగ్రహింపబడుతుందని చెప్పాడు (16:4).
పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త వహించాలని యేసు తన శిష్యులకు చెప్పాడు (16:6).
శిష్యులను జాగ్రత్త వహించాలని చెప్పడంలోని యేసు అసలైన ఉద్దేశం పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధలను గూర్చి జాగ్రత్త పడమని (16:12).
యేసు తన శిష్యులను "మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు?" అని అడిగాడు (16:13).
కొందరు బాప్తీస్మమిచ్చు యోహాను అనీ, కొందరు ఏలీయా అనీ, కొందరు యిర్మీయా అనీ, ప్రవక్తలలో ఒకడనీ అనుకొంటున్నారు (16;14).
"నీవు సజీవుడైన దేవుని కుమారడవైన క్రీస్తువు" అని పేతురు జవాబిచ్చాడు (16:16).
యేసు అడిగిన ప్రశ్నకు జవాబును పరలోకమందున్న తండ్రి అతనికి బయలుపరిచాడు (16:17).
యేసు పరలోకపు తాళపు చెవులు పేతురుకు ఇచ్చాడు. పేతురు భూలోకంలో దేనిని బంధిస్తాడో పరలోకంలో అది బంధించబడుతుంది, భూలోకంలో దేనిని విప్పుతాడో అది పరలోకంలో విప్పబడుతుంది అని యేసు చెప్పాడు (16:19).
తాను యెరూషలేముకు వెళ్లి, అనేక శ్రమలు పొంది, చంపబడి, మూడవ రోజున లేపబడవలసి ఉన్నదని చెప్పడం మొదలుపెట్టాడు (16:21).
యేసు పేతురుతో, "సాతానా, నా వెనుకకు పొమ్ము" అన్నాడు (16:23).
యేసును అనుసరించే ప్రతి ఒక్కరూ తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తికొని ఆయనను వెంబడించాలి (16:24).
ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే వానికి ఏమి ప్రయోజనము అని యేసు చెప్పాడు (16:26).
మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కలసి రాబోతున్నాడని యేసు చెప్పాడు (16:27).
మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రతివారికి వారి వారి క్రియల చొప్పున తగిన ప్రతిఫలం చెల్లిస్తాడు (16:27).