పేతురు, యాకోబు అతని సహోదరుడైన యోహాను యేసుతో కలసి వెళ్లారు (17:1).
యేసు ముఖము సూర్యునివలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివయ్యాయి (17:2).
మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడడానికి ప్రత్యక్షమయ్యారు (17:3).
వారు ముగ్గురికీ మూడు కుటీరాలు నిర్మిద్దామని పేతురు అన్నాడు (17:4).
ప్రకాశవంతమైన మేఘము నుండి, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి" అన్న మాటలు వినిపించాయి (17:5).
మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేచే వరకు ఈ దర్శనము ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు (17:9).
లేఖనాల ప్రకారం ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెడతాడని యేసు చెప్పాడు (17:11).
ఏలీయా బాప్తిసమిచ్చే యోహానుగా ఇదివరకే వచ్చినప్పుడు మనుషులు అతనిని తెలుసుకోక, వారి ఇష్టం వచ్చినట్టు అతని పట్ల చేశారు అని యేసు చెప్పాడు (17:10-13).
శిష్యులు చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి స్వస్థ పరచ లేకపోయారు (17:14-16).
యేసు అతనిలో ఉన్న దయ్యాన్ని గద్దించాడు. ఆ గంటలోనే ఆ బాలుడు స్వస్థత పొందాడు (17:18).
తమకున్న అల్ప విశ్వాసం వల్లనే బాలుణ్ణి శిష్యులు స్వస్థ పరచ లేకపోయారని యేసు చెప్పాడు (17:20).
యేసు తన శిష్యులతో తనను చంపే వారికీ తనను అప్పగిస్తారని, వారు తనను చంపుతారని, మూడవ రోజున తిరిగి లేస్తానని చెప్పినప్పుడు శిష్యులు విచారగ్రస్తులయ్యారు (17:22-23).
పేతురును సముద్రమునకు వెళ్లి, గాలం వేసి మొదటగా వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచి అక్కడ దొరికిన ఒక షెకెలుతో ఇద్దరి పన్ను కట్టాలని యేసు పేతురుతో చెప్పాడు (17:27).