పరిసయ్యులు తమ తల్లితండ్రుల నుండి సంక్రమించినది "దేవార్పితమని" చెప్పి తమ పిల్లలను వారికి సహాయం చేయనీయక అడ్డుపడుతున్నారు (15:3-6).
పరిసయ్యులు తమ పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు గాని వారి హృదయాలు ఆయనకు దూరముగా ఉన్నవి అని యెషయా ప్రవచించాడు (15:7-8).
పరిసయ్యులు మనుషులు కల్పించిన పద్ధతులు బోధిస్తున్నారు (15:9).
మనుష్యుని నోటిలోకి వెళ్ళునది అతనిని అపవిత్రపరచదని యేసు చెప్పాడు (15:11,17,20).
మనుష్యుని నోటి నుండి వచ్చునది అతనిని అపవిత్రపరుస్తుందని యేసు చెప్పాడు (15:11,18-20).
యేసు పరిసయ్యులను గుడ్డివారని పిలిచాడు. గుడ్డివారు గుడ్డివారికి దారి చూపినపుడు ఇద్దరూ గుంటలో పడతారు (15:14).
దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి (15:19).
యేసు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు (15:23).
యేసు, తాను ఇశ్రాయేలు ఇంటివారిలో నశించిన గొర్రెల వద్దకే పంపబడ్డానని చెప్పాడు (15:24).
ఆమె విశ్వాసము గొప్పదని చెప్పి, ఆమె కోరుకొన్నది నెరవేర్చాడు (15:28).
యేసు మూగ వారిని, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను స్వస్థపరిచాడు (15:30-31).
శిష్యుల వద్ద ఉన్న ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలతో యేసు జనసమూహం ఆకలి తీర్చాడు (15:34).
యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, రొట్టెలు విరిచి తన శిష్యులకు ఇచ్చాడు (15:36).
స్త్రీలు, పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు తృప్తిగా తిన్నారు (15:38).
వారందరూ తిన్న తరువాత ఏడు గంపల రొట్టెలు, చేపలు మిగిలాయి (15:37).