Matthew 15

Matthew 15:4

పరిసయ్యులు పారంపర్యాచారం నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎలా అతిక్రమిస్తున్నారని యేసు చెప్పాడు?

పరిసయ్యులు తమ తల్లితండ్రుల నుండి సంక్రమించినది "దేవార్పితమని" చెప్పి తమ పిల్లలను వారికి సహాయం చేయనీయక అడ్డుపడుతున్నారు (15:3-6).

Matthew 15:7

పరిసయ్యుల పలికే మాటలను గురించి, వారి హృదయాలను గురించి యెషయా ఏమని ప్రవచించాడు?

పరిసయ్యులు తమ పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు గాని వారి హృదయాలు ఆయనకు దూరముగా ఉన్నవి అని యెషయా ప్రవచించాడు (15:7-8).

దేవుని గురించిన మాటలు బోధించడానికి బదులు పరిసయ్యులు ఏమి బోధిస్తున్నారు?

పరిసయ్యులు మనుషులు కల్పించిన పద్ధతులు బోధిస్తున్నారు (15:9).

Matthew 15:10

ఒక మనుష్యుని అపవిత్రపరచనిది ఏమిటని యేసు చెప్పాడు?

మనుష్యుని నోటిలోకి వెళ్ళునది అతనిని అపవిత్రపరచదని యేసు చెప్పాడు (15:11,17,20).

ఒక మనుష్యుని ఏది అపవిత్రపరుస్తుందని యేసు చెప్పాడు?

మనుష్యుని నోటి నుండి వచ్చునది అతనిని అపవిత్రపరుస్తుందని యేసు చెప్పాడు (15:11,18-20).

Matthew 15:12

యేసు పరిసయ్యులను ఏమని పిలిచాడు? వారి వలన ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

యేసు పరిసయ్యులను గుడ్డివారని పిలిచాడు. గుడ్డివారు గుడ్డివారికి దారి చూపినపుడు ఇద్దరూ గుంటలో పడతారు (15:14).

Matthew 15:18

ఎలాంటి ఆలోచనలు ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి?

దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి (15:19).

Matthew 15:21

కనాను స్త్రీ తనను కనికరించమని కోరినప్పుడు మొదట యేసు ఏమి చేశాడు?

యేసు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు (15:23).

Matthew 15:24

ప్ర, కనాను స్త్రీకి సహాయం చేయకపోవడం విషయంలో యేసు ఎలాంటి వివరణ ఇచ్చాడు?

యేసు, తాను ఇశ్రాయేలు ఇంటివారిలో నశించిన గొర్రెల వద్దకే పంపబడ్డానని చెప్పాడు (15:24).

Matthew 15:27

కనాను స్త్రీ విధేయత చూసిన యేసు ఆమెతో ఏమి చెప్పాడు, ఆమెకోసం ఏమి చేశాడు?

ఆమె విశ్వాసము గొప్పదని చెప్పి, ఆమె కోరుకొన్నది నెరవేర్చాడు (15:28).

Matthew 15:29

గలిలయలో ఆయన దగ్గరకు వచ్చిన బహు జనసమూహమునకు ఏమి చేశాడు?

యేసు మూగ వారిని, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను స్వస్థపరిచాడు (15:30-31).

Matthew 15:32

యేసు ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలతో జనసమూహం ఆకలి తీర్చాడు?

శిష్యుల వద్ద ఉన్న ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలతో యేసు జనసమూహం ఆకలి తీర్చాడు (15:34).

Matthew 15:36

యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని ఏమి చేశాడు?

యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, రొట్టెలు విరిచి తన శిష్యులకు ఇచ్చాడు (15:36).

రొట్టెలు, చేపలను ఎంతమంది ప్రజలు తృప్తిగా తిన్నారు?

స్త్రీలు, పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు తృప్తిగా తిన్నారు (15:38).

వారందరూ తిన్న తరువాత ఎంత మిగిలింది?

వారందరూ తిన్న తరువాత ఏడు గంపల రొట్టెలు, చేపలు మిగిలాయి (15:37).