బాప్తిసమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడని హేరోదు యేసును గురించి అనుకున్నాడు (14:2).
హేరోదు తన సోదరుని భార్యను ఉంచుకొన్నాడని యోహాను చెప్పాడు (14:4).
ప్రజలు ఇతనిని ప్రవక్త అని గౌరవిస్తున్నందువల్ల ప్రజలకు భయపడి హేరోదు యోహానుకు వెంటనే మరణ శిక్ష విధించలేదు (14:5).
హేరోదియ ఏమి కోరినా ఇస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు (14:7).
ఒక పళ్ళెంలోయోహాను తలను తెచ్చి ఇవ్వమని కోరింది (14:8).
విందు సమయంలో ప్రజలందరి ఎదుటా చేసిన ప్రమాణం నెరవేర్చుకోవడానికి ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది. (14:9).
జనసమూహములను చూసి యేసు వారిపై కనికరపడి, వారిలో రోగులను స్వస్థపరిచాడు (14:14).
జనసమూహములకు మీరే భోజనము పెట్టమని యేసు తన శిష్యులతో చెప్పాడు (14:16).
యేసు ఆ రొట్టెలను, చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు జనసమూహమునకు పంచమని శిష్యులకు ఇచ్చాడు (14:19).
అయిదు వేలమంది పురుషులతోపాటు స్త్రీలు, పిల్లలు తినగా పన్నెండు గంపలు మిగిలిపోయాయి (14:20-21).
యేసు ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండ పైకి వెళ్ళాడు (14:23).
బలమైన గాలి వీచినప్పుడు శిష్యులు ప్రయాణిస్తున్న నావ అదుపుతప్పింది (14:24).
యేసు నీళ్ళపై నడుచుకుంటూ వచ్చాడు (14:25).
యేసు తన శిష్యులకు నేనే, భయపడవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పాడు (14:27).
నీళ్ళపై నడచి రమ్మని యేసు పేతురుతో చెప్పాడు (14:29).
పేతురు భయపడినప్పుడు నీళ్ళలో మునిగిపోవడం మొదలుపెట్టాడు (14:30).
యేసు, పేతురు దోనె ఎక్కినప్పుడు గాలి అణగిపోయింది (14:32).
దీనిని చూసిన శిష్యులు యేసు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కారు (14:33).
యేసు, ఆయన శిష్యులు సముద్రపు అవతలి తీరం చేరుకొన్నప్పుడు ప్రజలు రోగులను యేసు దగ్గరకు తీసుకువచ్చారు (14:35).