త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి తినివేశాయి (13:4).
మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు అక్కడ మన్ను లేనందున అవి మొలిచాయి గానీ, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి (13:5-6).
ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మొలిచి ముండ్లపొదలు పెరిగి వాటిని అణచివేశాయి (13:7).
మంచి నేలలో పడిన విత్తనాలు ఒకటి నూరంతలుగా, ఒకటి అరువదంతలుగా, ఒకటి ముప్పదంతలుగా ఫలించాయి (13:8).
యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు గానీ గ్రహించరు, చూస్తారు గానీ ఎంతమాత్రము తెలుసుకోరు (13:14).
యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజల హృదయాలు కొవ్వు పట్టాయి. వారి చెవులు మందములయ్యాయి, వారి కన్నులు మూసికోనిపోయాయి (13:15).
త్రోవ పక్కన పడిన విత్తనం వలే ఒక వ్యక్తివాక్యము విని దానిని గ్రహించక ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయములో చల్లిన దానిని ఎత్తుకుపోతాడు (13:19).
రాతి నెలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని వెంటనే దానిని సంతోషముగా గ్రహించును కానీ, వాక్యము నిమిత్తము శ్రమ అయినను, హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు (13:20-21).
ముండ్ల పొదలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తిని ఐహిక విచారములు, ధన మోహము ఆ వాక్యము అణచివేస్తాయి (13:22).
మంచి నేలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని గ్రహించి, సఫలుడై, నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా ఫలిస్తాడు (13:23).
శత్రువు పొలములో గురుగులు చల్లాడు (13:28).
రెండు పంటలూ కలసి పెరిగిన తరువాత కోతకాలము వచ్చినప్పుడు, గోధుమలను గిడ్డంగిలో సమకూర్చి, గురుగులను తగలబెట్టమని యజమాని చెప్పాడు (13:30).
ఆవగింజ మొక్క పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసించునంత చెట్టు అవుతుంది (13:31-32).
పరలోక రాజ్యము కొంచెము పొంగజేసే పదార్థం కలిసిన మూడు కుంచాల పిండి తో పోల్చబడినది (13:33).
మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు, పంట పొలం లోకం, మంచి విత్తనాలు రాజ్య వారసులు, గురుగులు దుష్టుని సంబంధులు, పంట కోయువారు దేవదూతలు (13:37-39).
యుగసమాప్తిలో దుర్నీతిపరులు అగ్నిగుండములో పడవేయబడతారు (13:42).
యుగసమాప్తిలో నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యునివలే తేజరిల్లుతారు (13:43).
తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలము కొన్నాడు (13:44).
మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి అ ముత్యం కొన్నాడు (13:45-46).
వల నిండినప్పుడు మంచి చేపలను గంపలోకి చేర్చి, చెడ్డవాటిని బయట పారవేస్తారు. అదే విధంగా యుగసమాప్తిలో దేవదూతలు నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పాడవేస్తారు (13:47-50).
"ఈ జ్ఞానం, ఈ అద్భుతములు చేసే శక్తి ఎక్కడినుంచి వచ్చాయి" అని ఆశ్చర్యపడ్డారు (13:54).
ప్రవక్త తన దేశములో, తన యింటిలో ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు (13:57).
స్వదేశీయుల అవిశ్వాసం వల్ల యేసు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు (13:58).