యేసు శిష్యులు పంటచేనిలో ప్రవేశించి వెన్నులు తుంచి తింటూ విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారని పరిసయ్యులు నేరారోపణ చేశారు (12:2).
యేసు తానే దేవాలయము కంటే గొప్పవాడినని చెప్పాడు (12:6).
మనుష్య కుమారుడైన యేసు విశ్రాంతి దినానికి ప్రభువు (12:8).
పరిసయ్యులు యేసును "విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా?" అని ప్రశ్నించారు (12:10).
విశ్రాంతి దినమున మేలు చేయుట న్యాయమేనని యేసు చెప్పాడు (12:12).
యేసు ఊచ చెయ్యి గలవాడిని స్వస్థపరచినపుడు పరిసయ్యులు ఆలయం బయటకు వెళ్లి యేసును ఎలా సంహరించాలి అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు (12:14).
యేసును గూర్చి యెషయా ప్రవచనం ప్రకారం యేసు జగడమాడడు, కేకలు వేయడు, నలిగినా రెల్లును విరువడు, మకమకలాడుతున్నఅవిసెనారను ఆర్పడు (12:19-20).
అన్యజనులకు దేవుని న్యాయవిధి యేసు ద్వారా ఎవరికి ప్రచురము చేయబడుతుంది (12:18,21).
సాతాను వలన సాతానును వెళ్ళగొడితే సాతాను రాజ్యము ఎలా నిలబడుతుంది అని యేసు చెప్పాడు (12:26).
దేవుని ఆత్మ వలన తాను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దేవుని రాజ్యము వారి యొద్దకు వస్తుందని యేసు చెప్పాడు (12:28).
ఆత్మ విషయమైన దూషణ అనే పాపం క్షమించబడదని యేసు చెప్పాడు (12:31).
చెట్టు అది కాసే ఫలాల వలన మంచిదో, కాదో తెలుస్తుంది (12:33).
తమ మాటలను బట్టి పరిసయ్యులు అపరాధులుగా తీర్పు తీర్చబడతారు అని యేసు చెప్పాడు(12:37).
యోనా ఉన్నట్టు, మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండబోతున్నానని యేసు ఈ తరం వారికి సూచన ఇచ్చాడు (12:39-40).
తాను యోనా కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:41).
నీనివే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యోనా ద్వారా, సొలోమోను ద్వారా దేవుని మాటలు విన్నారు. యేసు తరంలోని ప్రజలపై యోనా, సోలోమోనుల కంటే గొప్పవాడైన యేసు మాటలు వినలేదు (12:41-42).
తాను సొలోమోను కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:42).
వదిలి పోయిన అపవిత్రాత్మవెళ్లి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ వ్యక్తి కడపటి స్థితి కంటే మొదటి స్థితి హీనమైనదిగా అయ్యేలా చేస్తుంది. యేసు తరంలోని వ్యక్తి అలానే ఉంటాడు(12:43-45).
తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడే తనకు తల్లి, సహోదరుడు, సహోదరి అని యేసు చెప్పాడు (12:46-50).