అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతివిధమైన రోగమును, వ్యాధిని స్వస్థపరుచుటకు యేసు తన పన్నెండుమంది శిష్యులకు అధికారం ఇచ్చాడు (10:1).
యేసును అప్పగించేబోయే శిష్యుని పేరు ఇస్కరియోతు యూదా (10:4).
యేసు తన శిష్యులను ఇశ్రాయేలు దేశంలోని నశించిన గొర్రెల యొద్దకు పంపాడు (10:6).
లేదు, శిష్యులు ధనం గానీ, అదనంగా దుస్తులు గానీ తమ వెంట తీసుకుని వెళ్ళకూడదు (10:9-10).
శిష్యులు గ్రామ గ్రామాలకు తిరుగుతున్నపుడు యోగ్యుడైన ఒక వ్యక్తిని వెదకి అతని ఇంటి వద్ద బస చెయ్యాలి (10:11).
శిష్యులను అంగీకరించక, వారి మాటలు వినని పట్టణాల ప్రజలకు సోదోమ గోమోర్రా జరిగినదానికంటే మించిన కీడు జరుగుతుంది (10:14-15).
శిష్యులుగా ఉండగోరువారు ప్రజలచే మహాసభలకు అప్పగింపబడడానికి, కొరడా దెబ్బలు తినడానికి, అధిపతుల ఎదుట నిలబడడానికి సిద్ధపడి ఉండాలి (10:17-18).
శిష్యులు మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఆత్మ వారిలో ఉండి మాట్లాడిస్తున్నారు (10:20).
అంతము వరకు సహించినవాడు రక్షింపబడతారని యేసు చెప్పాడు (10:22).
యేసును ద్వేషించినవారు ఆయన శిష్యులను కూడా ద్వేషిస్తారు (10:22,24-25).
ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడనక్కరలేదని యేసు చెప్పాడు (10:28).
ఆత్మను, దేహమును కూడా నరకములో నశింపజేసే వాడికి భయపడాలని యేసు చెప్పాడు (10:28).
యేసును ఒప్పుకొన్నవారిని ఆయన తన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు (10:32).
యేసును తిరస్కరించిన వారిని ఆయన తన తండ్రి ఎదుట తిరస్కరిస్తాడు (10:33).
గృహాలలోని సభ్యులలో విభేదాలు పెట్టేందుకు తాను వచ్చానని యేసు చెప్పాడు (10:34-36).
యేసు కోసం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు (10:39).
శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లని నీరు ఇచ్చేవాడు అందుకు తగిన ఫలము పొందుతాడు (10:42).