పక్షవాతం గలవానితో అతని పాపలు క్షమించబడ్డాయని చెప్పడం ద్వారా ఆయనకు పాపాలు క్షమించే అధికారం ఉన్నదని చెప్పాడు (9:5-6).
ప్రజలు భయపడి మనుష్యునికి ఇలాంటి అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించారు (9:8).
యేసు శిష్యుడు కాకముందు మత్తయి సుంకపు పన్ను వసూలుదారుడు (9:9).
యేసు, ఆయన శిష్యులు సుంకరులతో, పాపులతో కలసి భోజనం చేశారు (9:10).
యేసు పాపులను పిలవడానికి వచ్చానని చెప్పాడు (9:13).
తన శిష్యులతో తనతో కలసి ఉన్నందున వారు ఉపవాసం ఉండడం లేదని యేసు చెప్పాడు (9:15).
యేసు వారి యొద్ద నుండి కొనిపోబడినప్పుడు ఉపవాసం ఉంటారని యేసు చెప్పాడు (9:15).
రక్తస్రావ రోగం గల స్త్రీ యేసు పైవస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే తాను స్వస్థపడతానని అనుకొన్నది (9:20-21).
స్త్రీ బాగుపడడానికి ఆమె విశ్వాసం దోహద పడిందని యేసు చెప్పాడు (9:22).
ఆ బాలిక చనిపోలేదు, నిద్రపోతున్నదని యేసు చెప్పినప్పుడు అక్కడి ప్రజలు ఆయనను అపహసించారు (9:24).
యేసు ఆ బాలికను మరణం నుండి లేపిన వార్త అ ప్రాంతమంతా వ్యాపించింది (9:26).
"దావీదు కుమారుడా, మమ్మును కనికరించుము" అంటూ ఇద్దరుగుడ్డి వారు కేకలు వేసారు (9:27).
యేసు ఇద్దరు గుడ్డి వారిలో ఉన్న నమ్మకాన్ని బట్టి స్వస్థపరిచాడు (9:29).
ఈయన దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు (9:34).
యేసు జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలే , విసిగి చెదరి ఉన్నందున వారిపై కనికరపడ్డాడు (9:36).
కొత్త విస్తారంగా ఉన్నందున కోత పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొమ్మని యేసు తన శిష్యులతో చెప్పాడు (9:38).