Matthew 8

Matthew 8:4

యేసు కుష్టరోగిని స్వస్థపరచిన తరువాత దేవాలయానికి వెళ్ళి యాజకునికి కనబడి మోషే నియమించిన కానుక సమర్పించమని ఎందుకు చెప్పాడు?

స్వస్థపడిన కుష్టరోగి యాజకుని ఎదుట సాక్ష్యార్ధంగా కనబడాలని దేవాలయానికి వెళ్ళమన్నాడు (8:4).

Matthew 8:5

పక్షవాతంతో పడియున్న తన సేవకుణ్ణి స్వస్థపరచమని శతాధిపతి కోరినప్పుడు యేసు ఏమి చెప్పాడు?

నేను వచ్చి సేవకుణ్ణి స్వస్థపరుస్తానని యేసు చెప్పాడు (8:7).

Matthew 8:8

యేసు తన ఇంటికి రావడం అవసరం లేదని శతాధిపతి ఎందుకు చెప్పాడు?

యేసు తన ఇంటికి వచ్చుటకు తాను అయోగ్యుడనని శతాధిపతి తలంచాడు. యేసు ఒక్క మాట పలికితే తన సేవకుడు బాగుపడతాడని నమ్మాడు (8:8).

యేసు శతాధిపతిని ఏమని మెచ్చుకున్నాడు?

ఇశ్రాయేలీయులలో ఎవరిలోనైనా ఇలాంటి విశ్వాసము కనబడలేదని యేసు చెప్పాడు (8:10).

Matthew 8:11

పరలోక రాజ్యములో ఎవరు భోజనపు బల్ల వద్ద కూర్చుంటారని యేసు చెప్పాడు?

అనేకులు తూర్పు నుండి, పడమర నుండి వచ్చి పరలోక రాజ్యములో భోజనపు బల్ల వద్ద కూర్చుంటారు (8:11).

ఏడ్పు, పండ్లు కొరుకుడు ఉండే చీకటిలోకి ఎవరు త్రోయబడతారని యేసు చెప్పాడు?

రాజ్య సంబంధులు చీకటిలోకి త్రోయబడతారని యేసు చెప్పాడు (8:12).

Matthew 8:14

యేసు పేతురు ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఎవరిని స్వస్థపరిచాడు?

యేసు పేతురు ఇంటిలోకి వెళ్ళినప్పుడు పేతురు అత్తను స్వస్థపరిచాడు (8:14-15).

Matthew 8:16

యేసు దయ్యములను వెళ్ళగొట్టి, సమస్త రోగులను స్వస్థపరిచినపుడు ఎవరి ప్రవచనం నెరవేర్చబడింది?

"ఆయన మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించెనని యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేరింది (8:17).

Matthew 8:18

యేసు నివాసం గురించి ఒక శాస్త్రి అడిగిన ప్రశ్నకు ఆయన ఏమి జవాబిచ్చాడు?

యేసు తనకు తల వాల్చుకొనుటకు కూడా స్థలము లేదని చెప్పాడు (8:20).

Matthew 8:21

ఒక శిష్యుడు తన తండ్రిని పాతిపెట్టుటకు అనుమతినిమ్మని అడిగినప్పుడు యేసు ఏమని చెప్పాడు?

యేసు ఆ శిష్యునితో, తనను వెంబడించమని, మరణించిన వారు మరణించిన వారిని పాతిపెట్టుకోనిమ్మని చెప్పాడు (8:21-22).

Matthew 8:23

సముద్రము మీద తుపాను లేచి పడవ అలలతో కప్పబడినప్పుడు యేసు ఏమి చేస్తున్నాడు?

సముద్రము మీద తుపాను లేచి పడవ అలలతో కప్పబడినప్పుడు యేసు నిద్రపోతున్నాడు (8:24).

Matthew 8:26

శిష్యులు యేసును లేపి తాము నశించిపోతున్నామని భయపడినప్పుడు యేసు వారితో ఏమన్నాడు?

యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, "అల్ప విశ్వాసులారా, ఎందుకు భాధపడుతున్నారు?" (8:26).

అక్కడ మిక్కిలి నిమ్మళం అయినప్పుడు శిష్యులు ఎందుకు ఆశ్చర్యపడ్డారు?

యేసుకు గాలీ, సముద్రమూ లోబడుతున్నాయని శిష్యులు ఆశ్చర్యపడ్డారు (8:27).

Matthew 8:28

యేసు గదరేనీయుల దేశము వచ్చినప్పుడు ఎవరిని కలుసుకున్నాడు?

యేసు దయ్యములు పట్టిన ఇద్దరు ఉగ్రులైన మనుషులను కలుసుకున్నాడు (8:28).

వారిలో ఉన్న దయ్యములు యేసుతో ఏమని చెప్పాయి?

సమయము రాకమునుపే మమ్మును బాధించుటకు వచ్చితివా అని యేసుతో చెప్పాయి (8:29).

Matthew 8:30

వారిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు దయ్యాలు ఏమి చేశాయి?

యేసు ఆ దయ్యాలను వెళ్ళగొట్టగా, అవి పందుల గుంపులో ప్రవేశించి సముద్రములోకి వేగంగా పరుగెత్తి నీళ్ళలో పడి చనిపోయాయి (8:32).

Matthew 8:33

యేసు పట్టణంలో ప్రవేశించినప్పుడు పట్టణస్థులు ఆయనను ఏమని బ్రతిమాలుకొన్నారు?

పట్టణస్థులు తమ ప్రాంతం విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలుకొన్నారు (8:34).