అపవాది చేత శోధింపబడడానికి యేసును ఆత్మ కొనిపోయాడు (4:1).
యేసు నలభై పగళ్ళు , నలభై రాత్రులు ఉపవాసమున్నాడు (4:2).
రాళ్ళను రొట్టెలుగా చేయమని అపవాది యేసును మొదటిగా శోధించాడు (4:3).
మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు జవాబిచ్చాడు (4:4).
అపవాది యేసును దేవాలయంపై నుండి క్రిందికి దూకమని చెప్పి శోదించాడు (4:5-6).
యేసు, ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదని చెప్పాడు (4:7).
అపవాది తనకు సాగిలపడి నమస్కారము చేయమని చెప్పాడు (4:8-9).
ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని యేసు అపవాదికి చెప్పాడు (4:10).
గలిలయ లోని ప్రజలకు వెలుగు కనబడింది అని పలికిన యెషయా ప్రవచనం నెరవేరింది (4:15-16).
యేసు, "పరలోకరాజ్యము సమీపించియున్నది కనుక మారుమనస్సు పొందుది" అని ప్రకటించడం మొదలుపెట్టాడు" (4:17).
పేతురు, ఆంద్రెయలను మనుషులను పట్టే జాలరులనుగా చేస్తానని యేసు చెప్పాడు (4:19).
పేతురు, ఆంద్రెయ, యాకోబు మరియు యోహానులు చేపలు పట్టేవారు (4:18,21).
యేసు గలిలయలోని సమాజమందిరములోకి వెళ్ళాడు (4:23).
నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్నవారిని, దయ్యములు పట్టినవారిని ఆయన దగ్గరకు తెస్తున్నారు, యేసు వారిని బాగుపరుస్తున్నాడు (4:24).
ఈ సమయంలో బహు జనసమూహములు యేసును వెంబడిస్తున్నారు (4:25).