బాప్తిసమిచ్చే యోహాను "పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి" అని ప్రకటిస్తున్నాడు (3:2).
"ప్రభువు మార్గము సరాళము చేయుడి" అనే ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు (3:3).
మారుమనస్సుకు తగిన ఫలము ఫలించమని బాప్తిసమిచ్చే యోహాను పరిసయ్యులకు, సద్దూకయ్యులకు చెప్పాడు (3:8).
అబ్రాహాము తమ తండ్రి అని తమలో తాము అనుకోవద్దని యోహాను చెప్పాడు (3:9).
మంచి ఫలము ఫలించని చెట్టు నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుందని యోహాను చెప్పాడు (3:10).
బాప్తిసమిచ్చే యోహాను తరువాత వచ్చేవాడు పరిశుద్ధాత్మలో, అగ్నిలో బాప్తిసమిస్తాడు (3:11).
"నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది" అని యేసు యోహానుతో చెప్పాడు (3:15).
యేసు నీటిలో నుండి బయటకు వచ్చీనప్పుదు దేవుని ఆత్మ పావురం రూపంలో పైనుండి తన పైకి క్రిందికి దిగి రావడం చూసాడు (3:16).
"ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" అన్న స్వరం పరలోకం నుండి వినిపించింది (3:17).