యేసు యూదా దేశంలోని బెత్లేహేములో జన్మించాడు (2:1).
తూర్పు దేశపు జ్ఞానులు యేసును "యూదుల రాజు" అని పిలిచారు (2:2).
తూర్పు దిక్కున వెలసిన యూదుల రాజు నక్షత్రం చూసి తెలుసుకున్నారు (2:2).
ఈ వార్త విన్న హేరోదు రాజు కలవరపడ్డాడు (2:3).
యేసు బేత్లెహేములో పుడతాడని ప్రవచనం ద్వారా వారు తెలుసుకున్నారు (2:5-6).
తూర్పు దేశం నుండి జ్ఞానులను నడిపించిన నక్షత్రం యేసు ఉన్న యింటిపై నిలిచింది (2:9).
జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాలుడుగా ఉన్నాడు (2:11).
జ్ఞానులు యేసుకు బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలుగా ఇచ్చారు (2:11).
వారిని హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని దేవుడు హెచ్చరించినందువల్ల వారు వేరొక మార్గంలో వెళ్లారు (2:12).
హేరోదు యేసును చంపాలని చూస్తున్నాడని, అందువల్ల మరియను, యేసును తీసుకొని ఐగుప్తుకు పారిపొమ్మని కలలో దూత చెప్పాడు (2:13).
యేసును ఇగుప్తుకు తీసుకు వెళ్ళినప్పుడు 'ఇగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని' అనే ప్రవచనం నెరవేరింది (2:15).
బేత్లెహేము ప్రాంతంలోని రెండు సంవత్సరాల లోపు వయసు మగ పిల్లలను చంపించాడు (2:16).
యోసేపుకు కలలో ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళమని సూచనలు అందాయి (2:19-20).
యోసేపు మరియా, యేసులతో కలసి గలిలయలోని నజరేతులో నివసించాడు (2:22-23).
క్రీస్తు నజరేతువాడని ప్రవక్తలు పలికిన మాట నెరవేరింది (2:23).