పరిసయ్యులు, శాస్త్రులు మోషే పీఠం మీద కూర్చుని చెప్పే వాటన్నిటినీ గైకొనుమని యేసు చెప్పాడు (23:2-3).
పరిసయ్యుల, శాస్త్రుల క్రియల చొప్పున చేయవద్దని యేసు ఎందుకు చెప్పాడంటే వారు చెబుతారు గాని ఆ ప్రకారం చేయరు (23:3).
పరిసయ్యుల, శాస్త్రులు ఇతరులు చూడాలని తమ క్రియలు జరిగిస్తారు (23:5).
పరలోకమందున్నవాడు ఒక్కడే మన తండ్రి, క్రీస్తు ఒక్కడే మన గురువు అని యేసు చెప్పాడు (23:8-10).
తనను హెచ్చించుకొనే వారిని తగ్గిస్తాడు, తనను తగ్గించుకోనే వారిని హెచ్చిస్తాదు (23:12).
పరిసయ్యుల, శాస్త్రులు ఒక వ్యక్తిని తమ మతంలోకి చేర్చుకొన్నప్పుడు ఆ వ్యక్తి వారికంటే రెండు రెట్లు అధిక శిక్షకు పాత్రుడవుతాడు (23:15).
యేసు పరిసయ్యులను, శాస్త్రులను పదే పదే వేషదారులు అని పిలిచాడు (23:13-15,23,25,27,29).
పరిసయ్యుల, శాస్త్రుల బోధలు అంధులైన మార్గదర్శకులు, అంధులైన అవివేకులు అని యేసు చెప్పాడు (23:16-19).
పరిసయ్యులు, శాస్త్రులు ధర్మ శాస్త్రములో ముఖ్యమైన విషయాలలో అంటే న్యాయము, కనికరము, విశ్వాసము విషయాలలో తప్పిపోతున్నారు (23:23).
పరిసయ్యులు, శాస్త్రులు తమ గిన్నెలు బయట శుభ్రం చేస్తున్నారు గాని గిన్నెల లోపల శుభ్రం చేయడం లేదు (23:25-26).
పరిసయ్యులు, శాస్త్రులు వేషధారణ, అన్యాయం, అక్రమాలతో తమ హృదయాలు నింపుకొన్నారు (23:25,28).
పరిసయ్యుల, శాస్త్రుల పితరులు దేవుని ప్రవక్తలను చంపివేశారు (23:29-31).
శాస్త్రులు, పరిసయ్యులు తీర్పులో నరక శిక్షను ఎదుర్కోబోతున్నారు (23:33).
వారిలో కొందరిని సిలువ వేస్తారు, కొందరిని కొరడాలతో కొడతారు, కొందరిని తరిమి వేస్తారు (23:34).
చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా వారి శాస్త్రుల, పరిసయ్యుల మీదకు వస్తుంది (23:35).
యేసు చెప్పిన ఇవన్నీప్రస్తుత తరమువారికి వస్తాయి (23:36).
యెరూషలేము సంతతి అంతటినీ ఒక చోట సమకూర్చవలెనని కోరినప్పుడు వారు నిరాకరించారు (23:37).
ఇప్పుడు యెరూషలేము పట్టణం విడిచిపెట్టబడింది (23:38).