Matthew 22

Matthew 22:5

రాజు తన కుమారుని పెండ్లి విందుకు ఆహ్వానం పంపినపుడు పిలువబడినవారు ఏమి చేశారు?

కొందరు ఆహ్వానం లక్ష్యపెట్టలేదు, కొందరు తమ సొంత పనులకు వెళ్ళిపోయారు, కొందరు ఆ సేవకులను పట్టుకుని అవమాన పరచి చంపివేశారు (22:2-6).

మొదట పెండ్లి విందుకు పిలువబడి, తిరస్కరించినవారిని రాజు ఏమి చేశాడు?

రాజు తన సేనలను పంపి ఆ హంతకులను చంపించి, వారి నగరాన్ని తగలబెట్టించాడు (22:7).

Matthew 22:8

తరువాత రాజు పెండ్లి విందుకు ఎవరిని పిలిచాడు?

తరువాత రాజు తన సేవకులకు కనబడినవారందరినీ, వారు మంచివారైనా, చెడ్డవారైనా అందరినీ పిలిపించాడు (22:9-10).

Matthew 22:13

పెండ్లి దుస్తులు ధరించనివారిని రాజు ఏమి చేశాడు?

పెండ్లి దుస్తులు ధరించనివారి కాళ్ళు, చేతులు కట్టివేసి చీకటిలోకి తోసివేశాడు (22:11-13).

Matthew 22:15

పరిసయ్యులు యేసును ఏమి చేయాలని చూశారు?

పరిసయ్యులు యేసును మాటలలో పెట్టి చిక్కుల్లో పడవేయాలని చూశారు (22:15).

పరిసయ్యుల శిష్యులు యేసును ఏమని ప్రశ్నించారు?

కైసరుకు పన్ను కట్టడం న్యాయమా, కాదా అని యేసును అడిగారు (22:17).

Matthew 22:20

పరిసయ్యుల శిష్యులకు యేసు ఏమని జవాబిచ్చాడు?

కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి ఇవ్వమని వారికి జవాబిచ్చాడు (22:21).

Matthew 22:23

పునరుత్దానమును గురించి సద్దూకయ్యుల నమ్మకం ఏమిటి?

పునరుత్దానము అనేది లేదని సద్దూకయ్యుల నమ్ముతారు (22:23).

Matthew 22:25

సద్దూకయ్యుల కథలో ఒక స్త్రీకి ఎంత మంది భర్తలు ఉన్నారు?

ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు (22:24-27).

Matthew 22:29

సద్దూకయ్యులకు తెలియని రెండు విషయాలు ఏమిటని యేసు చెప్పాడు?

సద్దూకయ్యులకు లేఖానాలు, దేవుని శక్తీ గురించి తెలియదు (22:29).

పునరుత్థానంలో పెండ్లి గురించి యేసు ఏమి చెప్పాడు?

పునరుత్థానంలో ఎవరూ పెండ్లి చేసుకోరని యేసు చెప్పాడు (22:30).

Matthew 22:31

పునరుత్థానం ఉన్నదని యేసు లేఖనాల ద్వారా ఎలా చూపించాడు?

తండ్రియైన దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైయున్నాడని లేఖనాలను ప్రస్తావిస్తూ యేసు చెప్పాడు (22:32).

Matthew 22:34

పరిసయ్యుడైన ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును ఏమని ప్రశ్నించాడు?

ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటని ప్రశ్నించాడు (22:36).

Matthew 22:37

యేసు చెప్పిన రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటి?

నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనేవి యేసు చెప్పిన ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలు (22:37-39).

Matthew 22:41

యేసు పరిసయ్యులను ఏమని ప్రశ్నించాడు?

క్రీస్తు ఎవరి కుమారుడు అని అడిగాడు (22:42).

పరిసయ్యులను ఏమని జవాబిచ్చారు?

క్రీస్తు దావీదు కుమారుడని పరిసయ్యులు జవాచ్చారు (22:42).

Matthew 22:43

తరువాత యేసు పరిసయ్యులను అడిగిన రెండవ ప్రశ్న ఏమిటి?

తన ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఎలా చెబుతున్నాడని యేసు అడిగాడు (22:43-45).

Matthew 22:45

పరిసయ్యులకు యేసుకు ఏమని జవాబిచ్చారు?

యేసు అడిగిన దానికి వారు ఎవరూ మాట్లాడలేకపోయారు (22:46).