ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఒక దేనారము ఇవ్వడానికి అంగీకరించాడు (20:1-2).
ఏది న్యాయమో అది ఇస్తానని ఇంటి యజమాని కూలివారితో చెప్పాడు (20:4-7).
పన్నెండు గంటలకు కుదుర్చుకున్న కూలీలకు ఒక దేనారము కూలి లభించింది (20:9).
తాము రోజంతా పనిచేసినప్పటికీ చివరి గంట పనిచేసినవారితో సమానమైన కూలీ దొరికిందని సణుగుకొన్నారు (20:11-12).
పొద్దుటి నుంచి పని చేసినవారికి చెప్పినట్టు ఒక దేనారం కూలి ఇచ్చానని, అయితే తన ఇష్ట ప్రకారం మిగతా కూలీలకు కూడా అంతే చెల్లించానని ఇంటి యజమాని చెప్పాడు (20:13-15).
తనను ప్రధాన యాజకులు శాస్త్రులు పట్టుకొని మరణ శిక్ష విధించి సిలువ వేస్తారని, తాను మూడవ రోజున తిరిగి లేస్తానని శిష్యులకు ముందుగా చెప్పాడు (20:17-19).
తన కుమారులు యేసు రాజ్యంలో ఆయనకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు కూర్చుని ఉండాలని యేసును కోరుకున్నది (20:20-21).
ఆయన ఎంపిక చేసిన వారికోసం తగిన స్థలాలను తండ్రి అయిన దేవుడు నిర్ణయిస్తాడు (20:23).
గొప్పవాడుగా ఉండగోరిన వాడు పరిచారకుడుగా ఉండాలని ఉండాలని యేసు చెప్పాడు (20:26).
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చానని యేసు చెప్పాడు (20:28).
ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు, "ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించు" అని కేకలు వేసారు (20:30).
ఇద్దరు గుడ్డివాళ్ళను చూసి యేసు వారిపై కనికరపడ్డాడు (20:34).