"ఏ కారణం చేతనైనా భార్యకు విడాకులు ఇవ్వడం న్యాయమేనా?" అని పరిసయ్యులు యేసుని ప్రశ్నించారు (19:3).
సృష్టి ఆరంభంలో దేవుడు పురుషుని, స్త్రీని సృష్టించాడని యేసు చెప్పాడు (19:4).
పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడని యేసు చెప్పాడు (19:5).
పురుషుడు తన భార్యను హత్తుకొని ఉండుట వలన వారిద్దరూ ఏక శరీరులుగా ఉంటారు (19:5-6).
దేవుడు జతపరచిన వారిని మానవుడు వేరు చేయకూడని చేయకూడని యేసు చెప్పాడు (19:6).
ఆనాటి యూదుల హృదయ కఠినత్వాన్ని బట్టి మోషే విడాకులు అనుమతించాడని యేసు చెప్పాడు (19:7-8).
కేవలం వ్యభిచారం కోసమే తన భార్యను విడిచిపెట్టి మరో స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారి. విడిచి పెట్టబడిన దానిని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారి అని యేసు చెప్పాడు (19:9).
నపుంసకులుగా మారేందుకు అంగీకరించే వారిని నపుంసకులుగా మారనివ్వండి అని యేసు చెప్పాడు (19:10-12).
చిన్నపిల్లలను యేసు దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు శిష్యులు వారిని గద్దించారు (19:13).
చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని తన యొద్దకు రానివ్వమని, పరలోక రాజ్యం ఇలాంటివారిదేనని యేసు చెప్పాడు (19:14).
నిత్యజీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలన్నిటినీ పాటించమని యేసు అ యువకునితో చెప్పాడు (19:16-17).
ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నానని అ యువకుడు చెప్పినప్పుడు యేసు అతనితో అతనికున్నవన్నీ అమ్మివేసి పేదవారికి ఇవ్వమని చెప్పాడు (19:20-21).
ఆ యువకుడు ఎక్కువ ఆస్థి గలవాడు కనుక యేసు చెప్పిన మాట విని విచార పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు (19:22).
ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని యేసు చెప్పాడు. అయితే దేవునికి సమస్తమును సాధ్యమే (19:23-26).
తనను వెంబడించిన శిష్యులు పునరుత్థాన దినమందు, వారు పన్నెండు సింహాసనములపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని యేసు చెప్పాడు (19:28).
మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అని యేసు చెప్పాడు (19:30).